మనకి నాలుగు యుగాలు ఉన్నాయని పెద్దలు చెప్తారు
అవి
1 కృత యుగం
2 త్రేతా యుగం
3 ద్వాపర యుగం
4 కలి యుగం
ముందుగా కృత యుగం ఏంటో చూదాం.
ఈ యుగం లో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందంట.. (అంటే ఏంటో తెలుసుకోవాలి, తెలుసుకొని చెప్తా..)
అందరు సత్యం మాట్లాడుతూ నీతి గా ఉండే వారుట
మరి త్రేతా యుగం
ఇది కొంచం ప్రక్యతి గాంచిన యుగం గా చెప్పొచు, ఎందుకంటే రాముడు ఈ యుగం వాడే కదా, రామాయణం తెలీయని వాళ్ళు ఉండరు. అందులో అయన ధర్మ పాలన గురించి తెలుస్తుంది. ఈ యుగం లో ధర్మం మూడు పాదాల మీద నడిచిందట, ఎందుకంటే మహా పతివ్రత అయిన సీతమ్మవారి మీద నిండా పడింది కదా..
తదుపరిది ద్వాపర యుగం
ఈ యుగం కూడా ప్రక్యతి గాన్చినదే, ఎందుకంటే ఈ యుగం శ్రీ కృష్ణుడు పరిపాలించాడు కదా.. ఆయన లీలలు తెలియని వారుండరు. భారతం లో ఈ యుగం గురించి ఉంటుంది. భారతం గురించి ఒక నానుడి ఉంది కదా
" వింటే భారతమే వినాలి తింటే గారెలే తినాలి" అని.. ఈ సందర్భం లో నాకు అది గుర్తుకు వచ్చింది.
ఈ యుగం లో ధర్మం రెండు పాదాల మీద నడిచిందంట ఎందుకంటే శ్రీ కృష్ణుడి మీద నీలాపనిందలు మోపారు కదా..
ఇక మిగిలింది కలి యుగం
ఈ యుగం అందరికి తెలిసిందే ఎందుకంటే, ప్రస్తుతం మనం ఉన్నది ఈ యుగం లో నే కాబట్టి, ఇప్పుడు మనం కలియుగం ప్రదమ పాదం లో ఉన్నామని పెద్దల మాట.. పాదానికి ఒక లక్ష ఎనభై సంవత్సరాలు ఉంటుంది ట.. కాబట్టి ఇప్పుడప్పుడే యుగాంతం అవ్వదు ట.. కానీ ప్రక్రుతి వైపరిత్యాలు జరుగుతాయి ట.. ఈ యుగం వచ్చె సరికి ధర్మం పూర్తి గా నశించి, వొంటి కాలితో కుంటుతూ నడుస్తుంది.. అది ఎలా నో అర్ధం అవుతూనే ఉంది.. ఒక్కలని ఒక్కళ్ళు కొట్టుకుంటారు, చంపుకుంటారు ట..
ఇలా ఈరోజు యుగాల గురించి తెలుసుకున్నాం :)
మళ్ళి ఇంకొక కాన్సెప్ట్ తో తదుపరి పోస్ట్..