దేవవ్రతుడు , గాంగేయుడు,భీష్ముడు
ఇవి భీస్మచార్యుల యొక్క పేర్లు
భీష్ముడు శoతన మహారాజు , గంగా దేవి ల 8దవ కుమారుడు..
ప్రభాసుడు అనే వసువే వసిష్టుని శాపవశాత్తు భీష్ముడు గా జన్మించాడు.
పూర్వం 8 మంది వసువులు ఆకాసమర్గమున తమ భార్యలతో కూడి వెడలుతుండగా, కింద ఒక గుహలో తప్పసు చేసుకుంటూ, తన పూజ నిమిత్తము ఆవు పాలు , పెరుగూ కొరకు సురభి అను ధేనువు మరియు ఆ ధేనువు యొక్క లేగ నందిని ని వసిష్టుడు ఉపయోగించుకోనుచుండెను. ఆ ధేనువును చూసి ప్రభాసుడు అను వసువు యొక్క భార్య ఆకర్షితురాలై తనకి ఆ ధేనువు కావాలని కోరగా, కాదనలేక ఆ దేనువుని ప్రభాసుడు అపహరిస్తే , వసిష్టుడు ఆగ్రహించి శాపవాక్కు విడిచిపెట్టాడు. 8మంది ,భూలోకం మానవులై జన్మిచేదరు. ఏడుగురు తల్లి చేత గంగ లో పడవేయ్యబడి, అపహరించిన ప్రభాసుడు 8దవ కుమారుడు గా దీర్ఘాయుష్కుడై, సంతు లేనివాడై జీవించును.
ఆ విదం గా భీష్ముడు జన్మించెను.